మలేసియాలో చిక్కుకున్న మన మహిళ హెచ్చార్సీని ఆశ్రయించనున్న భర్త
- July 16, 2015
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఉత్తరపాలెం వల్లూరుకు చెందిన యాల్లమెల్లి శాంతాకుమారి ఇంటిపని చేయడానికి 23 పిబ్రవరి 2015 న మలేసియా వెల్లింది. యజమాని పెట్టె హింసను తట్టుకోలేకపోతున్నానని, అనారోగ్యంగా ఉన్నానని రెండు నెలల క్రితం ఆమె ఫోన్ ద్వారా భర్త వెంకటేశ్వర రావుకు తెలియపరిచింది. చర్చి పాస్టర్ రత్నం, సంఘ సేవకురాలు సునీతా ఏలూరి గారల సలహా ప్రకారం అతను ఈ విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు 9 జూన్ 2015 న పిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ అనే ప్రవాసి కార్మిక సంఘం వారు ఈ విషయాన్ని 'మదద్' (భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన ఫిర్యాదుల నమోదు మరియు పర్యవేక్షణ వ్యవస్థ) ద్వారా మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ దృష్టికి తీసికెళ్లారు.
ఫిర్యాదు చేసి నెలకుపైగా అవుతున్నా ఫలితం లేనందున, శాంతాకుమారి భర్త వెంకటేశ్వర రావు 17 జులై 2015 న హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించనున్నాడు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషనర్ (భారత రాయబారి), డిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నారై విభాగం స్పెషల్ సెక్రెటరీ (ప్రోటోకాల్), పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లను ప్రతివాదులుగా చేర్చుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు.
--'మాగల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









