మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా

- September 18, 2025 , by Maagulf
మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా

దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గత రాత్రి ప్రత్యేకంగా వెలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాలను, "హ్యాపీ బర్త్‌డే" శుభాకాంక్షల పదాలను ప్రదర్శించింది.

ఆకర్షణీయంగా వెలిగిన బుర్జ్ ఖలీఫా రంగులు మారుతూ, భారత త్రివర్ణ పతాక రంగులు — కాషాయం, తెలుపు, ఆకుపచ్చ—మెరిశాయి.

ఇదే విధంగా గత ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకంగా అలంకరించబడింది.

ప్రధాని మోదీకి గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ప్రతీకగా ఈ ప్రత్యేక వెలుగుల ప్రదర్శన నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com