'డర్టీగేమ్' పూజా కార్యక్రమాలను జరుపుకుంది
- July 20, 2016
పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్ నటుడు సురేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్ నటుడు సురేష్ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారని నిర్మాత తాడి మనోహర్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 4 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నట్టు ఆయన పెర్కొన్నారు.
రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఏది డర్టీగేమ్? ఆ గేమ్ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్ ఏమిటి? ఆ గేమ్లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే అంటూ చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









