'డర్టీగేమ్' పూజా కార్యక్రమాలను జరుపుకుంది
- July 20, 2016
పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్ నటుడు సురేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్ నటుడు సురేష్ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారని నిర్మాత తాడి మనోహర్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 4 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నట్టు ఆయన పెర్కొన్నారు.
రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఏది డర్టీగేమ్? ఆ గేమ్ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్ ఏమిటి? ఆ గేమ్లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే అంటూ చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







