ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- September 28, 2025
దోహా: అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ ను ప్రారంభించనున్నట్లు ఖతార్ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సెంటర్లు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను ప్రోత్సహిస్తాయని, సమాజంలోని అన్ని వర్గాలకు అనువైన విద్యా ఎంపికలను అందిస్తాయని తెలిపింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది కొత్త కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీటికి ప్రభుత్వ పాఠశాలలు అవసరమైన విద్యా, పరిపాలనా మరియు సాంకేతిక సిబ్బందిని సమకూర్చుతారని తెలిపింది.
అల్ అబ్, అల్ మామౌరా, ముయిథర్, అల్ వక్రా, అల్ షహానియా, ఐన్ ఖలీద్, అల్ మార్ఖియా, అల్ ఖోర్ మరియు అబు హమూర్ లలో త్వరలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ కేంద్రాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









