ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- September 30, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ 2025-2026 సంవత్సరానికి తన నాల్గవ శీతాకాల సీజన్ ప్రణాళికను వెల్లడించింది. నవంబర్లో వింటర్ సీజన్ ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మస్కట్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి పాల్గొన్నారు.
గవర్నరేట్లోని నాలుగు విలాయత్లు, లిమాలోని నియాబత్ మరియు కుమ్జార్ గ్రామంలో 60 కి పైగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ప్రాంతీయ మరియు ప్రపంచ పర్యాటక పటంలో ముసాండం స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఇదే వేడుకలో 2024-2025 సీజన్ విజయానికి దోహదపడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలను ఎంపిక చేశారు. గత సీజన్ లో 7 లక్షల 89వేలకు పైగా పర్యాటకులు తరలించారు. తద్వారా ఒమన్ ఖజానాకు RO 251 మిలియన్ల ఒమన్ రియాల్స్ జమ అయినట్టు ముసందం గవర్నర్ సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది తెలిపారు. 2025-2026 శీతాకాల సీజన్ ప్రాంతీయ, ప్రపంచ పర్యాటక పటంలో గవర్నరేట్ హోదాను పటిష్టం చేయడంలో ఒక కొత్త దశను సూచిస్తుందని, అసమానమైన పర్యాటక అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









