ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- September 30, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ 2025-2026 సంవత్సరానికి తన నాల్గవ శీతాకాల సీజన్ ప్రణాళికను వెల్లడించింది. నవంబర్లో వింటర్ సీజన్ ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మస్కట్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి పాల్గొన్నారు.
గవర్నరేట్లోని నాలుగు విలాయత్లు, లిమాలోని నియాబత్ మరియు కుమ్జార్ గ్రామంలో 60 కి పైగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ప్రాంతీయ మరియు ప్రపంచ పర్యాటక పటంలో ముసాండం స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఇదే వేడుకలో 2024-2025 సీజన్ విజయానికి దోహదపడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలను ఎంపిక చేశారు. గత సీజన్ లో 7 లక్షల 89వేలకు పైగా పర్యాటకులు తరలించారు. తద్వారా ఒమన్ ఖజానాకు RO 251 మిలియన్ల ఒమన్ రియాల్స్ జమ అయినట్టు ముసందం గవర్నర్ సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది తెలిపారు. 2025-2026 శీతాకాల సీజన్ ప్రాంతీయ, ప్రపంచ పర్యాటక పటంలో గవర్నరేట్ హోదాను పటిష్టం చేయడంలో ఒక కొత్త దశను సూచిస్తుందని, అసమానమైన పర్యాటక అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









