ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- September 30, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ 2025-2026 సంవత్సరానికి తన నాల్గవ శీతాకాల సీజన్ ప్రణాళికను వెల్లడించింది. నవంబర్లో వింటర్ సీజన్ ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మస్కట్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి పాల్గొన్నారు.
గవర్నరేట్లోని నాలుగు విలాయత్లు, లిమాలోని నియాబత్ మరియు కుమ్జార్ గ్రామంలో 60 కి పైగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ప్రాంతీయ మరియు ప్రపంచ పర్యాటక పటంలో ముసాండం స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఇదే వేడుకలో 2024-2025 సీజన్ విజయానికి దోహదపడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలను ఎంపిక చేశారు. గత సీజన్ లో 7 లక్షల 89వేలకు పైగా పర్యాటకులు తరలించారు. తద్వారా ఒమన్ ఖజానాకు RO 251 మిలియన్ల ఒమన్ రియాల్స్ జమ అయినట్టు ముసందం గవర్నర్ సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది తెలిపారు. 2025-2026 శీతాకాల సీజన్ ప్రాంతీయ, ప్రపంచ పర్యాటక పటంలో గవర్నరేట్ హోదాను పటిష్టం చేయడంలో ఒక కొత్త దశను సూచిస్తుందని, అసమానమైన పర్యాటక అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







