ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- September 30, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ 2025-2026 సంవత్సరానికి తన నాల్గవ శీతాకాల సీజన్ ప్రణాళికను వెల్లడించింది. నవంబర్లో వింటర్ సీజన్ ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మస్కట్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి పాల్గొన్నారు.
గవర్నరేట్లోని నాలుగు విలాయత్లు, లిమాలోని నియాబత్ మరియు కుమ్జార్ గ్రామంలో 60 కి పైగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ప్రాంతీయ మరియు ప్రపంచ పర్యాటక పటంలో ముసాండం స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఇదే వేడుకలో 2024-2025 సీజన్ విజయానికి దోహదపడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలను ఎంపిక చేశారు. గత సీజన్ లో 7 లక్షల 89వేలకు పైగా పర్యాటకులు తరలించారు. తద్వారా ఒమన్ ఖజానాకు RO 251 మిలియన్ల ఒమన్ రియాల్స్ జమ అయినట్టు ముసందం గవర్నర్ సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది తెలిపారు. 2025-2026 శీతాకాల సీజన్ ప్రాంతీయ, ప్రపంచ పర్యాటక పటంలో గవర్నరేట్ హోదాను పటిష్టం చేయడంలో ఒక కొత్త దశను సూచిస్తుందని, అసమానమైన పర్యాటక అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









