కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది..
- July 21, 2016
కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది. కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలుగా పనిచేయనున్నాయి. ఇంటర్నెట్, సంబంధిత సేవలు, ఆధార్పై ప్రత్యేకంగా పనిచేసేందుకు ఈ కొత్త శాఖను ఏర్పాటుచేసినట్లు కేంద్రం తెలిపింది.
ఈ మార్పులను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆమోదించినట్లు కేబినెట్ సెక్రటేరియట్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), ఆధార్ నంబర్లు తదితర విషయాలపై పనిచేయనుంది. గతేడాది సెప్టెంబర్లో యూఐడీఏఐను నీతీఆయోగ్ కింది నుంచి కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిపాలన కిందికి తెచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







