ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- October 03, 2025
మస్కట్: గాజా స్ట్రిప్ కు అత్యవసర మానవతా సహాయంతో వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ దాడిని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ మరియు మానవతా చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులు ఇటువంటి అమానవీయ చర్యలను కొనసాగించడం చూస్తే.. ఆకలిని యుద్ధ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇది అత్యంత దారుణం అని ఒమన్ తెలిపింది.
పాలస్తీనా భూభాగాల్లోకి మానవతా సహాయాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా వెంటనే అనుమతించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి మరియు పాలస్తీనా పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన మరియు మానవతా బాధ్యతలను చేపట్టాల్సిన అవసరాన్ని ఒమన్ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









