ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- October 03, 2025
మస్కట్: గాజా స్ట్రిప్ కు అత్యవసర మానవతా సహాయంతో వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ దాడిని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ మరియు మానవతా చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులు ఇటువంటి అమానవీయ చర్యలను కొనసాగించడం చూస్తే.. ఆకలిని యుద్ధ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇది అత్యంత దారుణం అని ఒమన్ తెలిపింది.
పాలస్తీనా భూభాగాల్లోకి మానవతా సహాయాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా వెంటనే అనుమతించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి మరియు పాలస్తీనా పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన మరియు మానవతా బాధ్యతలను చేపట్టాల్సిన అవసరాన్ని ఒమన్ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది.
తాజా వార్తలు
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!









