ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- October 03, 2025
మస్కట్: గాజా స్ట్రిప్ కు అత్యవసర మానవతా సహాయంతో వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ దాడిని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ మరియు మానవతా చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులు ఇటువంటి అమానవీయ చర్యలను కొనసాగించడం చూస్తే.. ఆకలిని యుద్ధ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇది అత్యంత దారుణం అని ఒమన్ తెలిపింది.
పాలస్తీనా భూభాగాల్లోకి మానవతా సహాయాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా వెంటనే అనుమతించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి మరియు పాలస్తీనా పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన మరియు మానవతా బాధ్యతలను చేపట్టాల్సిన అవసరాన్ని ఒమన్ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు