క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- October 03, 2025
మనామా: అంతర్జాతీయ మోసపూరిత పథకాల ద్వారా పొందిన BD75,000 కంటే ఎక్కువ నగదును మనీ లాండరింగ్ చేసినందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఒక నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయస్థానం నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD105,000 జరిమానా విధించింది. అంతేకాకుండా అతని ఆస్తుల నుండి BD75,299 జప్తు చేయాలని ఆదేశించింది.
నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం నిందితుడు వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నాడని వెల్లడైంది. మోసపూరిత పెట్టుబడి పథకాల బాధితుల నుండి తన రెండు బ్యాంకు ఖాతాలలోకి అతను నిధులను పొందాడు. ఆపై వాటిని CoinMENA ప్లాట్ఫారమ్లోని తన ఖాతాకు క్రిప్టోకరెన్సీ (USDT) కొనుగోలు చేయడానికి బదిలీ చేశాడు. ఆ తర్వాత అతను నిధులను Binance.com లోని తన ఖాతాకు తరలించి, క్రిమినల్ నెట్వర్క్ అందించిన అనేక ఎలక్ట్రానిక్ వాలెట్లకు పంపిణీ చేసి, అందుకు బదులుగా కమిషన్ తీసుకున్నాడు. వివిధ పెట్టుబడి కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్ళు బాధితులను మోసగించారని దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







