క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- October 03, 2025
మనామా: అంతర్జాతీయ మోసపూరిత పథకాల ద్వారా పొందిన BD75,000 కంటే ఎక్కువ నగదును మనీ లాండరింగ్ చేసినందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఒక నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయస్థానం నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD105,000 జరిమానా విధించింది. అంతేకాకుండా అతని ఆస్తుల నుండి BD75,299 జప్తు చేయాలని ఆదేశించింది.
నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం నిందితుడు వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నాడని వెల్లడైంది. మోసపూరిత పెట్టుబడి పథకాల బాధితుల నుండి తన రెండు బ్యాంకు ఖాతాలలోకి అతను నిధులను పొందాడు. ఆపై వాటిని CoinMENA ప్లాట్ఫారమ్లోని తన ఖాతాకు క్రిప్టోకరెన్సీ (USDT) కొనుగోలు చేయడానికి బదిలీ చేశాడు. ఆ తర్వాత అతను నిధులను Binance.com లోని తన ఖాతాకు తరలించి, క్రిమినల్ నెట్వర్క్ అందించిన అనేక ఎలక్ట్రానిక్ వాలెట్లకు పంపిణీ చేసి, అందుకు బదులుగా కమిషన్ తీసుకున్నాడు. వివిధ పెట్టుబడి కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్ళు బాధితులను మోసగించారని దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







