క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- October 03, 2025
మనామా: అంతర్జాతీయ మోసపూరిత పథకాల ద్వారా పొందిన BD75,000 కంటే ఎక్కువ నగదును మనీ లాండరింగ్ చేసినందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఒక నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయస్థానం నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD105,000 జరిమానా విధించింది. అంతేకాకుండా అతని ఆస్తుల నుండి BD75,299 జప్తు చేయాలని ఆదేశించింది.
నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం నిందితుడు వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నాడని వెల్లడైంది. మోసపూరిత పెట్టుబడి పథకాల బాధితుల నుండి తన రెండు బ్యాంకు ఖాతాలలోకి అతను నిధులను పొందాడు. ఆపై వాటిని CoinMENA ప్లాట్ఫారమ్లోని తన ఖాతాకు క్రిప్టోకరెన్సీ (USDT) కొనుగోలు చేయడానికి బదిలీ చేశాడు. ఆ తర్వాత అతను నిధులను Binance.com లోని తన ఖాతాకు తరలించి, క్రిమినల్ నెట్వర్క్ అందించిన అనేక ఎలక్ట్రానిక్ వాలెట్లకు పంపిణీ చేసి, అందుకు బదులుగా కమిషన్ తీసుకున్నాడు. వివిధ పెట్టుబడి కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్ళు బాధితులను మోసగించారని దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







