యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- October 06, 2025_1759748525.jpg)
యూఏఈ: 2025 చివరిలో యూఏఈ నివాసితులు ఈద్ అల్ ఎతిహాద్ను జరుపుకోనున్నారు. పబ్లిక్ హాలిడే సమయంలో రెండు వీకేండ్లను చేర్చడం ద్వారా నివాసితులు 9 రోజులపాటు సెలవులను పొందవచ్చని అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్లో ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సెలవుల కారణంగా విమాన ఛార్జీలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.
డిసెంబర్ సెలవుల సీజన్లో ప్రయాణించే వారు ఇప్పుడే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. సీజన్ లో విమాన ఛార్జీలు 50 శాతం వరకు పెరగవచ్చని తెలిపారు. ఇప్పుడు బుక్ చేసుకునే ప్రయాణికులు నవంబర్ చివరి వరకు వేచి ఉండే వారితో పోలిస్తే 30 శాతం నుండి 40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని ముసాఫిర్.కామ్ సీఓఓ రహీష్ బాబు సూచించారు. ప్రస్తుతం, దుబాయ్ నుండి వచ్చే రౌండ్-ట్రిప్ ఛార్జీలు కీలకమైన అంతర్జాతీయ మార్గాల్లో పోటీ ధరలను చూపిస్తున్నాయని తెలిపారు.
సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలకు 6 నుండి 8 వారాల ముందుగానే బుకింగ్ విండో ఉంటుందని క్లియర్ట్రిప్ అరేబియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ బాగుల్ తెలిపారు. డిమాండ్ పెరిగే కొద్ది ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. కాగా, డిసెంబర్ నెలకు సంబంధించి ప్రయాణ హడావుడి ప్రారంభమైందని తెలిపాడు. ఇప్పటికే కొన్ని రూట్లలో విమాన ఛార్జీలను పెంచి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. కాబట్టి, రాబోయే సెలవును ఆస్వాదించడానికి ఇప్పుడే ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా 50శాతం వరకు ఆదా చేసుకోవచ్చని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్