దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- October 06, 2025
దోహా: యూకే నుండి ఇండియాకు వెళుతుండగా దోహాలో స్ట్రోక్కు గురైన వృద్ధ భారతీయ ప్రయాణీకుడి కోలుకున్నాడు. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో అత్యవసర వైద్య సంరక్షణ తర్వాత సురక్షితంగా భారత్ కు తరలించారు. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణీకుడి అల్లుడు రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. UK నుండి భారతదేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. తాము ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేట్ పొందే వరకు తమకు ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం వారు అండగా నిలిచారని అన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో భాగంగా సహకరించిన అన్నివర్గాలకు ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి







