సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- October 06, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కు కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ లోగో ఆవిష్కరణను 20వ జాతీయ సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ఈ కొత్త లోగో ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ కమిషనర్ పదవులను రేవంత్ రెడ్డి (RTI New Logo)ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కొత్త కమిషనర్ల బృందం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రిని కలవడం, ఆర్టీఐ వ్యవస్థ మరింత బలపడుతుందనే సంకేతంగా పరిగణించబడుతోంది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







