సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- October 06, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కు కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ లోగో ఆవిష్కరణను 20వ జాతీయ సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ఈ కొత్త లోగో ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ కమిషనర్ పదవులను రేవంత్ రెడ్డి (RTI New Logo)ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కొత్త కమిషనర్ల బృందం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రిని కలవడం, ఆర్టీఐ వ్యవస్థ మరింత బలపడుతుందనే సంకేతంగా పరిగణించబడుతోంది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!







