అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!

- October 07, 2025 , by Maagulf
అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!

రబత్: సౌదీ పెట్టుబడి మంత్రి ఇంజనీర్ ఖలీద్ అల్-ఫలిహ్ నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మొరాకో లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశాలలో ఫోకస్ చేయనున్నారు.

అల్-ఫలిహ్ పర్యటన సౌదీ అరేబియా - మొరాకో మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమ, పర్యాటకం, వ్యవసాయం, రవాణా మరియు మౌలిక సదుపాయాలు వంటి వివిధ ప్రాధాన్యత రంగాలలో పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com