భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- October 12, 2025
న్యూ ఢిల్లీ: భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టిందని, ఈ మార్పుకు ప్రధాన కారణం ఇరు దేశాల బలమైన నాయకత్వమని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ అన్నారు.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాయబారిగా గోర్ను నియమించగా, ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించకముందే ఢిల్లీలో పర్యటిస్తూ కీలక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
38 ఏళ్ల వయసులోనే రాయబారిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా గోర్ అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాయబారిగా రికార్డు సృష్టించారు. ట్రంప్ (Donald Trump) కి సన్నిహిత మిత్రుడిగా పేరుపొందిన ఆయన, గతంలో అమెరికా రాజకీయ వ్యవస్థలో పలు కీలక పదవులు చేపట్టారు. దౌత్యవేత్తగా ఆయన నియామకం భారత్-అమెరికా సంబంధాలకు నూతన దిశనివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 9న ఢిల్లీ చేరుకున్న సెర్గియో గోర్, తన ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







