ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- October 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖలో కీలక మార్పులు చేసింది. కొత్త కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధికారికంగా పనులను ప్రారంభించారు. ఈ నియామకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమాచార వ్యవస్థ మరింత సమర్థవంతంగా నడవాలని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న హిమాన్షు శుక్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్గా బదిలీ చేయడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా ప్రఖర్ జైన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సమాచార శాఖలో ఉన్న అధికార బాధ్యతల్లో ఈ తరహా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇటీవల ప్రభుత్వం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పనిచేస్తున్న కె.ఎస్.విశ్వనాథన్ ను ఐ అండ్ పీఆర్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్గా,
నరసాపురం సబ్ కలెక్టర్గా, అలాగే ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్గా సేవలందించారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శాఖ కార్యకలాపాలు, విధుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను అభినందించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం