ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- October 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖలో కీలక మార్పులు చేసింది. కొత్త కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధికారికంగా పనులను ప్రారంభించారు. ఈ నియామకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమాచార వ్యవస్థ మరింత సమర్థవంతంగా నడవాలని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న హిమాన్షు శుక్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్గా బదిలీ చేయడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా ప్రఖర్ జైన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సమాచార శాఖలో ఉన్న అధికార బాధ్యతల్లో ఈ తరహా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇటీవల ప్రభుత్వం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పనిచేస్తున్న కె.ఎస్.విశ్వనాథన్ ను ఐ అండ్ పీఆర్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్గా,
నరసాపురం సబ్ కలెక్టర్గా, అలాగే ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్గా సేవలందించారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శాఖ కార్యకలాపాలు, విధుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను అభినందించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







