సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- October 13, 2025
రియాద్: సౌదీ హెరిటేజ్ కమిషన్ జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో 1,516 కొత్త పురావస్తు ప్రదేశాలను నమోదు చేశారు. దీంతో మొత్తం పురావస్తు ప్రదేశాల సంఖ్య 11,577కి చేరకుంది. సౌదీ అరేబియా అంతటా పురావస్తు ప్రదేశాలను డాక్యుమెంట్ చేయడం మరియు సంరక్షించడంలో కమిషన్ పనిచేస్తుంది. కొత్త ప్రదేశాలలో రియాద్ నుంచి 1,174 సైట్లు, అల్-బహాలో 184 సైట్లు, తబుక్లో 85 సైట్లు, ఉత్తర సరిహద్దుల్లో 70 సైట్లు మరియు జెడ్డాలో మూడు సైట్లు ఉన్నాయి.
ఇప్పటివరకు నమోదు కాని పురావస్తు ప్రదేశాలను పురావస్తు సైట్ రిపోర్టింగ్ సర్వీస్ ద్వారా, అలాగే కమిషన్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు, స్థానిక శాఖల ద్వారా నివేదించాలని పౌరులు మరియు నివాసితులు కోరింది. జాతీయ వారసత్వాన్ని రక్షించడంలో మరియు అభివృద్ధి చేయడంలో కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ఇది పెంపొందిస్తుందని హెరిటేజ్ కమిషన్ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







