నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- October 17, 2025
కువైట్: కువైట్ లోని జలీబ్ అల్ షుయోఖ్ లో నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇది నిర్వహిస్తున్న ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మేధో సంపత్తి హక్కులు మరియు వాణిజ్య మోసాలకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కువైట్ మునిసిపాలిటీ సమన్వయంతో కంపెనీపై రైడ్స్ నిర్వహించారు. అక్రమ కర్మాగారాన్ని సీజ్ చేసిన అధికారులు 15వేల పెర్ఫ్యూమ్ ప్యాకేజింగ్ బాక్సులను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 28వేల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అన్ని రకాల వాణిజ్య మోసాలను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, అత్యవసర నంబర్ 112 కు కాల్ చేయడం ద్వారా ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







