నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- October 17, 2025
కువైట్: కువైట్ లోని జలీబ్ అల్ షుయోఖ్ లో నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇది నిర్వహిస్తున్న ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మేధో సంపత్తి హక్కులు మరియు వాణిజ్య మోసాలకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కువైట్ మునిసిపాలిటీ సమన్వయంతో కంపెనీపై రైడ్స్ నిర్వహించారు. అక్రమ కర్మాగారాన్ని సీజ్ చేసిన అధికారులు 15వేల పెర్ఫ్యూమ్ ప్యాకేజింగ్ బాక్సులను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 28వేల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అన్ని రకాల వాణిజ్య మోసాలను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, అత్యవసర నంబర్ 112 కు కాల్ చేయడం ద్వారా ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









