గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- October 18, 2025
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వింటర్ షెడ్యూల్పై ఉన్న అనిశ్చితి తొలిగింది. కేరళకు ప్రయాణించే యూఏఈ నివాసితులు ఇప్పుడు తిరువనంతపురంకు విమాన సేవలను కొనసాగించవచ్చు. రాబోయే వింటర్ సీజన్ (అక్టోబర్ 2025-మార్చి 2026) కోసం కేరళ మరియు గల్ఫ్ దేశాల మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిర్వహించే ఫ్లైట్స్ సంఖ్యను తగ్గించాలని ఎయిర్ ఇండియా యోచిస్తోందని అంతకుముందు వార్తలు వచ్చాయి.
అయితే, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నుండి కీలకమైన గల్ఫ్ మార్గాలను పునరుద్ధరిస్తుందని భారత పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ ప్రకటించారు. అక్టోబర్ 28 నుండి దుబాయ్ మరియు డిసెంబరు 3 నుండి అబుదాబి ఫ్లైట్స్ పునఃప్రారంభమవుతాయని ఎయిర్లైన్ ధృవీకరించిందని థరూర్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపారు.
ప్రస్తుతం సమ్మర్ షెడ్యూల్లో ఫ్లైట్స్ రన్ అవుతున్నాయని, త్రివేండ్రం-దుబాయ్-త్రివేండ్రం మార్గంలో బుకింగ్లు అక్టోబర్ 27 వరకు ఓపెన్ గా ఉన్నాయని డీరా ట్రావెల్ అండ్ టూరిస్ట్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ సుధీష్ తెలారు. ఇంతకుముందు, అక్టోబర్ 28 నుండి సర్వీసులు నిలిపివేయబడతాయని భావించామని, కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాటిని పునరుద్ధరించిందని తెలిపారు. తాము ఇప్పుడు వింటర్ సీజన్ కు సంబంధించి బుకింగ్లను కూడా చేస్తున్నామని సుధీష్ వెల్లడించారు.
ఎయిరిండియా కూడా 2026 నాటికి కేరళ నుంచి అంతర్జాతీయ విమానాల సంఖ్య 231కి, దేశీయ విమానాల సంఖ్య 245కి పెరుగుతుందని, ప్రస్తుత కొనసాగుతున్న కొరతను అధిగమిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









