నిన్న గల్లంతైన విమానం ఆచూకి ఇంకా లభించలేదు
- July 22, 2016
నిన్న గల్లంతైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ఏఎన్-32 ఆచూకి ఇంకా లభించలేదు. ఎయిర్ఫోర్స్ విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్ఫోర్స్ సిబ్బంది ఆరుగురు, ఎన్ఏడీ సిబ్బంది 8 మందియ ఉన్నారు. చెన్నై తీరానికి 280 కి.మీ దూరంలో విమానం అదృశ్యం అయిందని రక్షణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. టర్పునావికాదళానికి చెందిన 12 నౌకలు, ఒక సబ్ మెరైన్, 2 పీ-8ఐ విమానాలు, రెండు డార్నియాల ఆ విమానం కోసం గాలిస్తున్నాయి.గల్లంతైన విమానంలో విశాఖ వాసులు, ఎన్ఏడీకి చెందిన 20మందికి పైగా ఉద్యోగులున్నట్లు సమాచారం. చార్జ్మెన్ సాంబమూర్తి, క్వాలిటీ ఇన్స్పెక్టర్ భూపేంద్రసింగ్, ఆర్మామెంట్ ఫిట్టర్లు ప్రసాద్బాబు, నాగేందర్రావు, సేనాపతి, మహారాణా, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, శ్రీనివాసరావు, చిన్నారావు కుటుంబాలకు సమాచారం అందజేశారు. విమాన దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







