రియో ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాస్టర్ బ్లాస్టర్
- July 22, 2016
రియో ఒలింపిక్స్ క్రీడా సంబరంలో పాల్గొనాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాక్ ఆహ్వానించారు. తెందుల్కర్ ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగనున్న రియోడిజెనిరో నగరానికి ఆగస్టు 2న చేరుకొని గేమ్స్లో పాల్గొనే భారత క్రీడాకారులను సచిన్ ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. జికా వైరస్తో ముప్పున్న బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ను సచిన్ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం లండన్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సచిన్ రియో ప్రయాణానికి సంసిద్ధమై అక్కడ భారత క్రీడాకారులకు మద్దతు పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







