రియో ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాస్టర్ బ్లాస్టర్
- July 22, 2016
రియో ఒలింపిక్స్ క్రీడా సంబరంలో పాల్గొనాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాక్ ఆహ్వానించారు. తెందుల్కర్ ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగనున్న రియోడిజెనిరో నగరానికి ఆగస్టు 2న చేరుకొని గేమ్స్లో పాల్గొనే భారత క్రీడాకారులను సచిన్ ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. జికా వైరస్తో ముప్పున్న బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ను సచిన్ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం లండన్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సచిన్ రియో ప్రయాణానికి సంసిద్ధమై అక్కడ భారత క్రీడాకారులకు మద్దతు పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









