కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- October 22, 2025
కువైట్: జూన్ 2025 చివరి నాటికి కువైట్లో డొమెస్టిక్ వర్కర్స్ మినహా మొత్తం కార్మికుల సంఖ్య 2.229 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు తాజా లేబర్ మార్కెట్ డేటా వెల్లడించింది. వీరిలో 1.78 మిలియన్ల మంది ప్రవాసులు ఉండగా, 4 లక్షల 48వేల 900 మంది కువైట్ పౌరులు ఉన్నారు.
కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయ జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం వర్క్ పోర్సులో 25.9% శాతానికి సమానమైన 5 లక్షల 78వేల 240 మంది కార్మికులు ఉన్నారు. గతేడితో పోలిస్తే 4,375 మంది కొత్తగా వచ్చి చేరారు. ఇక ఈజిప్షియన్లు 4 లక్షల 69వేల370 మంది కార్మికులతో రెండవ స్థానంలో ఉండగా, కువైట్ పౌరులు 4 లక్షల 48వేల 900 మంది కార్మికులతో మూడవ స్థానంలో ఉన్నారు.
కువైట్ వర్కర్లలో 73.1% మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. వీరి సంఖ్య 3 లక్షల 27 వేల 967 లుగా ఉంది. ఇక 10.2% శాతం మంది, అనగా 45 వేల 860 మంది కువైట్ పౌరులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. కువైట్ పౌరుల సగటు నెలవారీ జీతం KD 1,571కి చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు సగటున KD 1,605 సంపాదించగా.. ప్రైవేట్ రంగంలో ఉన్నవారు KD 1,401 సంపాదించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







