దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- October 23, 2025
దుబాయ్: దుబాయ్ లో దీపావళి నాడు విషాధం చోటుచేసుకుంది. తన ఇంటి వెలుపల భారతీయ యువకుడు హఠాత్తుగా మరణించాడు. అత్యుత్తమ భారతీయ ప్రవాస విద్యార్థి మరియు ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా గ్రహీత అయిన వైష్ణవ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి వెలుపల కన్నుమూశారు. అతని మరణానికి ప్రాథమిక కారణం కార్డియాక్ అరెస్ట్ అని అధికారులు తేల్చారు. అతను మిడిల్సెక్స్ యూనివర్శిటీ దుబాయ్లో మార్కెటింగ్లో BBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
18 ఏళ్ల అతను GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థి. వైష్ణవ్ మృతికి పాఠశాల సంతాపం తెలిపింది. “మా మాజీ విద్యార్థి మరియు స్కూల్ కౌన్సిల్ మాజీ హెడ్, వైష్ణవ్ కృష్ణకుమార్ (2024-25 బ్యాచ్) గత రాత్రి హఠాత్తుగా మరణించాడు. ఆయన మృతికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. అతని తల్లితండ్రులకు (అతని తల్లి విధు కృష్ణకుమార్, మా స్టీమ్ టీచర్) కు ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







