హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- October 23, 2025
కువైట్: కౌన్సెలర్ నాజర్ అల్-హైద్ నేతృత్వంలోని అప్పీల్ కోర్టు, గతంలో ఒక తండ్రి మరియు అతని కొడుకుపై విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసింది. అదే సమయంలో వారికి 10,000 కువైట్ దినార్ల జరిమానా విధించింది. కాగా, వారి రెండవ కుమారుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని కోర్టు సమర్థించింది.
ఒక సూడాన్ కాంట్రాక్టర్ మరియు ఒక భారతీయ కాంట్రాక్టర్కు ఒక్కొక్కరికి 3,000 దినార్ల జరిమానా విధించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని ఆరోపణల నుండి ఇద్దరు ప్రవాస కంపెనీ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 60 మందికి పైగా ప్రవాస నర్సులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. నిందితులు తమను సూడాన్ మరియు భారత్ నుండి తీసుకువచ్చారని, మంత్రిత్వ శాఖ నియమించిన తర్వాత తమ జీతాలలో కొంత భాగాన్ని కంపెనీ యజమానులకు చెల్లించాలని ఖాళీ పేపర్లపై సంతకాలు చేయమని బలవంతం చేశారని నర్సులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!