దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- October 23, 2025
దుబాయ్: విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ లో మూడవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్నారు.దుబాయ్ లీమెరిడియన్ హోటల్లో సాయంత్రం 6.30 గంటలకు APNRTS ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.
యూఏఈలోని తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే వేలాది మంది రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు.యూఏఈతో పాటు కువైట్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు రానున్నారు. నిర్వాహకుల అంచనా ప్రకారం 2 వేల మందికి పైగా తెలుగు ప్రజలు ఈ డయాస్పొరా మీటింగ్లో పాల్గొననున్నారు.
యూఏఈలోని వివిధ ఎమిరేట్స్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని బృందాలుగా హాజరుకానున్నారు. విదేశీ పర్యటనల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి తెలుగు ప్రజలతో చర్చలు జరిపి, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్రను ప్రోత్సహించే విధంగా సీఎం చంద్రబాబు డయాస్పొరా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గతంలో సింగపూర్లో జరిగిన తెలుగు డయాస్పొరా మీటింగ్కు 2000 మంది హాజరైనట్లు గుర్తుచేస్తూ, యూఏఈ సమావేశానికి మరింత పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని APNRTS అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







