హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- October 23, 2025
కువైట్: కౌన్సెలర్ నాజర్ అల్-హైద్ నేతృత్వంలోని అప్పీల్ కోర్టు, గతంలో ఒక తండ్రి మరియు అతని కొడుకుపై విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసింది. అదే సమయంలో వారికి 10,000 కువైట్ దినార్ల జరిమానా విధించింది. కాగా, వారి రెండవ కుమారుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని కోర్టు సమర్థించింది.
ఒక సూడాన్ కాంట్రాక్టర్ మరియు ఒక భారతీయ కాంట్రాక్టర్కు ఒక్కొక్కరికి 3,000 దినార్ల జరిమానా విధించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని ఆరోపణల నుండి ఇద్దరు ప్రవాస కంపెనీ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 60 మందికి పైగా ప్రవాస నర్సులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. నిందితులు తమను సూడాన్ మరియు భారత్ నుండి తీసుకువచ్చారని, మంత్రిత్వ శాఖ నియమించిన తర్వాత తమ జీతాలలో కొంత భాగాన్ని కంపెనీ యజమానులకు చెల్లించాలని ఖాళీ పేపర్లపై సంతకాలు చేయమని బలవంతం చేశారని నర్సులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ









