28 తర్వాత కలిసిన పేగుబంధం
- July 23, 2016
హైదరాబాద్ పోలీస్ ఆరు నెలలపాటు శ్రమించి దుబాయ్కి చెందిన మహిళల్ని, వారి తల్లితో కలిపారు. తల్లి నుంచి 28 ఏళ్ళ క్రితం విడిపోయిన అయేషా మరియు ఫాతిమా రసీద్ ఇటీవల హైదరాబాద్కి వెళ్ళి తమ తల్లి గురించిన సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరారు. పోలీసులు ఆరు నెలలపాటు శ్రమించి 60 ఏళ్ళ నజియా బేగమ్ని కనుగొన్నారు. ఆమెను, తన కుమార్తెలతో కలిపేందుకు పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా అయేషా, ఫాతిమాతోపాటు నజియా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తమ తల్లిని దుబాయ్కి పంపేశారనీ, అప్పటినుంచీ తాము తండ్రి వద్దే ఉండిపోయామని తెలిపారు. కర్నాటకలోని బీదర్లో ఫ్రూట్ సెల్లర్గా పనిచేస్తున్న వ్యక్తిని నజియా తిరిగి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కలిగారు. తమ తల్లిని జీవితంలో కలుసుకోలేమనుకున్నామనీ అయితే హైదరాబాద్ పోలీసుల చొరవతో తల్లిని కలుసుకోగలిగామని అయేషా చెప్పారు. ఇన్నేళ్ళుగా తల్లికి దూరంగా ఉండి చాలా బాధపడ్డామనీ ఇకపై తమ తల్లిని బాగా చూసుకుంటామని పాతిమా చెప్పారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









