ఎస్‌డీఎఫ్‌ అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నా ఐసిస్‌

- July 23, 2016 , by Maagulf
ఎస్‌డీఎఫ్‌ అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నా ఐసిస్‌

 ఐసిస్‌ ఉగ్రభూతం సిరియా వాసులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇటీవల టర్కీ - రఖా మధ్యలో వ్యూహాత్మక ప్రాంతమైన మన్‌బిజ్‌ వద్ద డజన్ల కొద్దీ పౌరులను సంకీర్ణ దళాలు హతమార్చినట్లు ఆరోపణలు రావడంపై వారు వివరణ ఇచ్చారు.
ఇటీవల మన్‌బిజ్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో 11 మంది పిల్లలతో సహా 56మంది పౌరులు మృతిచెందినట్లు బ్రిటన్‌కు చెందిన ది సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆరోపించింది. దీంతో సంకీర్ణ దళాలు దీనిపై విచారణ చేపట్టాయి. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్స్‌(ఎస్‌డీఎఫ్‌) కాల్పులను అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నాయని తేలినట్లు కల్నల్‌ క్రిస్‌ గార్వెర్‌ తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో ఐసిస్‌ ఉగ్రవాదులు ఎస్‌డీఎఫ్‌ దళాలకు ఎదురుపడ్డారన్నారు. వారు దాడికి సిద్ధమవుతుండటంతో ఎస్‌డీఎఫ్‌ దళాలు వారు ఉంటున్న భవనాలు, వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశాయి. అనంతరం అక్కడి పరిస్థితినిబట్టి ఉగ్రవాదులు పౌరులతో కలిసిపోయి దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని గార్వెర్‌ తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com