జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- October 27, 2025
న్యూ ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్(CJI) సూర్యకాంత్ నియామక ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్(B.R.Gavai) తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సూచించారు. ఈ సిఫారసుతో ఆయన నియామకానికి మార్గం సాఫీ అయ్యింది.
జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనుండగా, తదుపరి రోజు నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు సీనియారిటీ ఆధారంగా సీజేఐ నియామకం జరిగే సంప్రదాయం ప్రకారం ఈ ఎంపిక జరిగింది.
1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించిన సూర్యకాంత్,(CJI)హిసార్ ప్రభుత్వ పీజీ కళాశాల నుంచి డిగ్రీ, మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీస్ ప్రారంభించి, 1985లో చండీగఢ్కు మారి పంజాబ్–హర్యానా హైకోర్టులో వాదనలు ప్రారంభించారు.
2000లో హర్యానా రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా నియమితులై గుర్తింపు పొందారు. 2004లో పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. త్వరలోనే ఆయన నియామకంపై అధికారిక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







