నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!

- October 27, 2025 , by Maagulf
నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!

యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆరోజున ఉదయం 11 గంటలకు అందరూ జెండాను ఎగురవేయాలని యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరులు, నివాసితులు మరియు సంస్థలు పాల్గొని, జెండా ఎగురవేయాలని అన్నారు. 

అంతకుముందు, దుబాయ్ 'నేషనల్ మంత్ 'ను ప్రకటించింది.  ఇది డిసెంబర్ 2న జెండా దినోత్సవం నుండి ఈద్ అల్ ఎతిహాద్ వరకు యూఏఈ జాతీయ సందర్భాలను ఎమిరేట్ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించింది.  ప్రతిసారీ జెండాను ఎగురవేసే ముందు దానిని పరిశీలించాలని సూచించారు.  అది దెబ్బతినకుండా, ముడతలు పడకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోవాలన్నారు. జెండాను ఎరుపు భాగం పైకి మరియు మిగిలిన మూడు రంగులు క్రిందికి ఉండేలా వీధుల్లో ఎగురువేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com