సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- October 27, 2025
రియాద్: సౌదీ అరేబియా చమురుయేతర ఎగుమతులు పెరిగాయి. 2024 ఆగస్టు నెలతో పోలిస్తే 2025 ఆగస్టులో 5.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) బులెటిన్ తెలిపింది. వాణిజ్య బ్యాలెన్స్ 4.1 శాతం మిగులు వృద్ధిని నమోదు చేసింది. ఇది 24.2 బిలియన్ సౌదీ అరేబియా మొత్తం చమురుయేతర ఎగుమతుల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు 25.4 శాతం వాటాను కలిగి ఉండగా, రసాయన ఉత్పత్తులు 22.7 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి.
దిగుమతి పరంగా చూస్తే.. యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 29.8 శాతం ఉన్నాయి. ఇది గతేడాది కంటే 24.7 శాతం పెరుగుదల నమోదైంది.
మరోవైపు చమురు ఎగుమతులు కూడా 7 శాతం పెరిగాయి. సౌదీ అరేబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. మొత్తం ఎగుమతుల్లో 16.2 శాతం మరియు మొత్తం దిగుమతుల్లో 26.4 శాతం వాటాను కలిగి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11.1 శాతం ఎగుమతులు మరియు 5.4 శాతం దిగుమతులతో రెండవ స్థానంలో ఉండగా, ఇండియా 9.2 శాతం ఎగుమతులతో మూడవ స్థానంలో ఉంది. దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఓడరేవు దిగుమతులకు ప్రధాన కేంద్రంగా, మొత్తంలో 25.6 శాతం ఎగుమతులు, దిగుమతులు ఇక్కడి నుండే జరిగాయి. ఆ తరువాత జెడ్డా ఇస్లామిక్ ఓడరేవు 21.9 శాతంతో రెండో స్థానంలో ఉందని స్టాటిస్టిక్స్ అథారిటీ బులెటిన్ తెలిపింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







