కార్మిక నివాసాల వద్ద అగ్నిప్రమాదం
- July 23, 2016
అబూ ధాబీ పడమట ప్రాంతంలో అగ్నిప్రమాదం గురువారం జరగ్గా అబూ ధాబీ సివిల్ డిఫెన్స్ జట్లు నియంత్రణలోనికి తీసుకువచ్చింది.ఈ అగ్ని ప్రమాదంలో దగ్గరలో ఉన్న 50 తాత్కాలిక కార్మిక వసతి యూనిట్లు మరియు అల్ హమారా ప్రాంతంలో సమీపంలో నిలిపి ఉన్న బస్సును అగ్ని చుట్టుముట్టిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం కానీ తీవ్రంగా గాయపడినట్లు గానే సమాచారం లేదు.
గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి అప్రమత్తమయనట్లు అబూ ధాబీ పౌర రక్షణ జనరల్ డైరెక్టరేట్ అల్ ఘాయతి ఏ ఏం డి అల్ ఘువైఫ తెలిపారు. దీనితో తాము సివిల్ డిఫెన్స్ జట్లు మరియు త్వరితగతిన స్పందించే యూనిట్లు ప్రమాద స్థలానికి తరలించారు మరియు ఇతర యూనిట్లు మంటలను వ్యాప్తి చెందకుండా నిరోధించే పనిలో నిమగ్నమయ్యారు. అబూధాబీ లో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటోనని ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. తాత్కాలిక కార్మిక నివాస వసతి ఉపయోగిస్తున్నప్పుడు అన్ని భద్రతా నియమాలు కట్టుబడి కాంట్రాక్టర్లు మరియు భవనం యజమానులు ఉండాలని కోరారు. తాత్కాలిక హౌసింగ్ యూనిట్లు మధ్య తగినంత స్థలం వదిలి మరియు గృహ నుండి విడిగా వంటశాలలలో నిర్మించాలని అల్ అన్సారీ వారికి సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









