3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- October 28, 2025
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి, మరియు విశ్వవ్యాప్తికి అంకితంగా నిర్వహించబడుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుండి 5వ తేదీ వరకు గుంటూరులోని శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో నందమూరి తారకరామారావు వేదిక పై జరుగనున్నాయి.
దేశ విదేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి తెలుగు ప్రతినిధులు, చలన చిత్ర , సాహితీ, సాంస్కృతిక కళాకారులు, కవి సమ్మేళనాలు, సదస్సులు, హస్త కళల, పుస్తక, చిత్ర కళల ప్రదర్శనలు, ఆధ్యాత్మిక వేదిక. వేలాది మంది యువత తెలుగు సంస్కృతిపై కళా ప్రదర్శనలు జరుగనున్నాయి.
తెలుగు మహా సభలకు మీకు మా హృదయ పూర్వక ఆహ్వానం.మహా సభల మూడు రోజులు మాతో గడపి మాకు స్ఫూర్తిని కలిగించవలసినదిగా ప్రార్థన. మీతో అనుబంధంగా వున్న సంస్థలకు,కవులకు, విద్యార్థులకు కూడా మా సభక్తిక ఆహ్వానాన్ని మీ ద్వారా తెలుపగలరు.
మీ రాక సమాచారాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా మాకు తెలియజేయండి.
మేము మీకు అందించగల సేవలు
- నమోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు
- వసతి నుండి వేదిక ప్రాంగణానికి స్థానిక రవాణా ఏర్పాట్లు
- మోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు
- మహా సభల మూడు రోజులు ఉచిత అల్పాహార, భోజన సదుపాయం.( భోజనం టోకెన్స్ ఇవ్వబడును)
- డార్ మెంటరి వసతి, పరుపు, టాయిలెట్స్ సదుపాయం ఇవ్వబడును.ఎవరి టాయిలెట్ కిట్ వారే తెచ్చుకొనవలెను.(వేడి నీళ్ళ సదుపాయం కుదరదు).
- స్త్రీలకు, పురుషులకు వేరు వేరు డార్ మెంటరీ ల ఏర్పాటు.
- నమోదు చేసుకొని, పాల్గొన్న వారికి అభినందన పత్రము ఇవ్వబడును.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







