ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- October 28, 2025
గుంటూరులో నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా అద్భుతమైన చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.2026, జనవరి 3,4,5 తేదీల్లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని వివరించారు.అందులో భాగంగా స్థానిక శ్రీ సత్యసాయి స్పిర్చివల్ సిటీ ప్రాంగణంలో ‘మన అమరావతి’ పేరుతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రదర్శనలో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా వైభవం, ఆంధ్రప్రదేశ్ కీర్తి, పర్యావరణంతోపాటు ప్రకృతి సౌందర్యం తదితర అంశాలను ప్రతిబింబించే "చిత్రకళా కృతులను" ప్రదర్శించేందుకు వర్ధమాన, ప్రముఖ చిత్రకారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రదర్శనలో ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ కళాకారునికి ప్రశంసా పత్రంతోపాటు ఈ మహాసభల అభినందన పతకం అందిస్తామని వివరించారు. చిత్రకారులు తమ చిత్రాలను కింద చిరునామాకు 2025, డిసెంబర్ 15వ తేదీ లోపు పంపాల్సి ఉంటుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కింది చిరునామాకు పంపాలని సూచించారు.
చిరునామా:
ఎస్.విజయ్ కుమార్,
సమన్వయకర్త–చిత్ర కళా ప్రదర్శన “మన అమరావతి”
202, సత్యవతి హోమ్స్,
కనకమేడల కన్వెన్షన్ ఎదురుగా,
మెయిన్ రోడ్, ఎస్విఎన్ కాలనీ,గుంటూరు 522006
సెల్ నెంబర్ : 9849503860.
నిబంధనలు..
గీసిన చిత్రాలు పరిమాణం: గరిష్ఠం 24” x 30” ఉండాలని,ఏదైనా ఫ్రేమ్ చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలనీ కోరారు. ఇక ఈ ప్రదర్శనలోని ఆయా చిత్రాలు విక్రయం జరిగితే.. వచ్చిన నగదు మొత్తాన్ని నేరుగా ఆయా కళాకారులకు అందజేయ బడుతుందని స్పష్టం చేశారు.
తెలుగు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహత్తర కళా ప్రదర్శనలో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని కార్యదర్శి శ్రీ ధవేజి , ముఖ్య సమన్వయకర్త శ్రీ పి.రామచంద్ర రాజు, సహ సమన్వయకర్త వి.విద్యాసాగర్ తెలిపారు.
మరిన్ని వివరాలు కోసం..
డా.గజల్ శ్రీనివాస్
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్
సెల్ నెంబర్: 9849013697
పి.రామచంద్ర రాజు
ముఖ్య సమన్వయ కర్త
3వ ప్రపంచ తెలుగు మహాసభలు- 2026
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







