ఇండియా గేట్‌ వద్ద 'రియో పరుగు' ప్రారంభించనున్న మోదీ

- July 23, 2016 , by Maagulf
ఇండియా గేట్‌ వద్ద 'రియో పరుగు' ప్రారంభించనున్న మోదీ

వచ్చే నెలలో బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరోలో ఆరంభంకానున్న ఒలింపిక్‌ గేమ్స్‌పై భారత్‌లో అవగాహన తీసుకురావడంలో భాగంగా 'రియో పరుగు'ను నిర్వహించనున్నారు. దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద రియో పరుగును భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. వేలాది మంది ప్రజలు ఈ పరుగులో పాల్గొని భారత ఒలింపిక్‌ అథ్లెట్లకు మద్దతు పలకనున్నట్లు అసోచామ్‌ కాన్ఫరెన్స్‌లో గోయల్‌ పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో వేదికగా ఒలింపిక్‌ గేమ్స్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com