పెరుగు రొయ్యల కూర
- July 23, 2016
కావలసిన పదార్దాలు :
పచ్చిరొయ్యలు : అరకేజి పెరుగు : అర కప్పు మసాలా పొడి : అర టీ స్పూన్ పచ్చిమిర్చి : మూడు ఉల్లి ముక్కలు : అర కప్పు టమాటా : ఒకటి ఉప్పు : తగినంత కారం :టీ స్పూన్ పసుపు : కొద్దిగా నూనె : అర కప్పు గసగసాలు : టీ స్పూన్ కరివేపాకు : కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్ కొత్తిమీర : కట్ట కొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి. 2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి. 3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి. 4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. 5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి. 6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి. 7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి. అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









