చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు..
- July 23, 2016
చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది. ఈ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 114కు పెరిగింది. అలాగే 111 మంది గల్లంతు అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా దాదాపు 52,900 ఇళ్లు కుప్పకూలాయని... అలాగే 15,5000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సైనికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. దాదాపు 1200 మంది ప్రజల సహకారంతో సహాయక చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అంచనా వేసేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు విశదీకరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







