బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- November 06, 2025
మనామా: కేరళ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రాజు నారాయణస్వామి బహ్రెయిన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆరోజు రాత్రి 8:00 గంటలకు జింజ్లోని ఎడ్యుపార్క్ ఇన్స్టిట్యూట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త కె.జి. బాబురాజ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ నారాయణస్వామి పర్యటనతో పాటు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ నవంబర్ 7 మరియు 8 తేదీల్లో జింజ్లోని ఎడ్యుపార్క్ కాంప్లెక్స్లో మినీ మ్యాథ్ ఒలింపియాడ్ను కూడా నిర్వహిస్తాయి. వివిధ పాఠశాలల నుండి దాదాపు 50 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అదజేస్తారు. ఈ మేరకు వివరాలను స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







