ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 08, 2025
యూఏఈ: ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూఏఈలోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వ్యవస్థలకు యూజర్ యాక్సెస్ ఇచ్చే ముందు ముందస్తుగా వారిని పరీక్షించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యాపార కేంద్రాలు మంత్రిత్వ శాఖ సేవలను పొందాలనుకునే సంస్థలు మరియు వ్యక్తులకు మద్దతు అందించే ప్రైవేట్ రంగ సంస్థలను రిఫర్ చేస్తాయని పేర్కొంది.
ఈ కేంద్రాలు కస్టమర్ డేటా గోప్యతను కాపాడాలని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపితమైతే చట్టపరమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది.
మోహ్రేకు తప్పుడు డేటా, డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని అందించడం నేరంగా పరిగణించనున్నారు. వ్యాపార కేంద్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







