డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు రోడ్డున..
- July 24, 2016
డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు రోడ్డున పడుతున్నాయని 'తెలుగు టెలివిజన్ యూనియన్' మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. ఫిలిం చాంబర్లో 'తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ యూనియన్' సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'డబ్బింగ్ సీరియళ్లతో ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉపాధి కోల్పోతున్నారు. వీటిని ఆపేయాలని ఒకసారి ఉద్యమం చేశాం.
మరోసారి ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకుంటామ'ని చెప్పారు. అనంతరం బుల్లితెర నటీనటుల డైరెక్టరీని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత గురురాజ్, టీవీ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు సంఘం అధ్యక్షుడు వినోద్బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, నటులు శివాజీ రాజా, రామ్జగన్, నాగమణి, సుబ్బారావు పలువురు టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







