జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- March 02, 2026
తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగపునారి సమీపంలో ఉత్సాహంగా సాగుతున్న ఈ పోటీలు ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయాయి.క్రీడలో భాగంగా బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపుతప్పి గ్యాలరీలోని ప్రేక్షకుల పైకి దూసుకెళ్లడంతో తీవ్ర తొక్కిసలాట మరియు భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ అనుహ్య ఘటనలో ముగ్గురు వ్యక్తులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఎద్దుల దాడిలో సుమారు 76 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణంగా జల్లికట్టు పోటీల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎద్దులు అదుపు తప్పి నేరుగా ప్రేక్షకుల జోన్లోకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక పోలీసులు మరియు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విషాదకర ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







