హరిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం రూపొందాలని చంద్రబాబు..

- July 25, 2016 , by Maagulf
హరిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం రూపొందాలని చంద్రబాబు..

విజయవాడ: రాష్ట్రంలో 50శాతం పచ్చదనం ఏర్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల 29న 'వనం-మనం' కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటే సంకల్పంలో 5కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం రూపొందాలని టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడిన చంద్రబాబు ఆకాంక్షించారు.విజయవాడలోని తన నివాసం నుంచి 4600 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేయాలని.. టీం లీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ అన్ని మొక్కలను సంరక్షించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల సహకారంతో వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్లాంటేషన్‌, పంట సంజీవని, సీసీ రోడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ గ్రామంలో పడిన వర్షపు నీరు అక్కడే భూగర్భంలోకి చేరేలా శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com