క్రెడిట్ కార్డ్ ఎక్స్ట్రా ఛార్జ్: 100,000 జరీమానా
- July 25, 2016
క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్పై అదనంగా ఛార్జీలను వసూలు చేసే సంస్థలకు 100,000 జరీమానా విధించనున్నట్లు అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఓ సర్క్యులర్లో పేర్కొంది. గత నెలలో సుప్రీం కమిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్, వ్యాపార వర్గాలను ఉద్దేశించి ఎలాంటి అదను ఛార్జీ క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్పై వసూలు చేయరాదని విజ్ఞప్తి చేసింది. హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ట్రావెల్ ఏజెంట్స్, జ్యుయెల్లర్స్, ట్రేడర్స్ మరియు కొందరు సర్వీస్ ప్రొవైడర్లు 2 దిర్హామ్ల నుంచి 5 దిర్హామ్ల వరకు ఒక్కో కార్డ్ ట్రాన్జాక్షన్కీ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా అలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే 100,000 జరీమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనాసరే, అదనపు ఛార్జీల కోసం డిమాండ్ చేస్తే వినియోగదారులు టోల్ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







