ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- November 27, 2025
మస్కట్: ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) క్లారిటీ ఇచ్చింది.సుల్తానేట్ వెలుపల పనిచేస్తున్న లైసెన్స్ పొందిన మరియు లైసెన్స్ లేని టెలికమ్యూనికేషన్ కంపెనీల సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రజల ఆందోళనలపై స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లైసెన్స్ పొందిన అన్ని టెలికమ్యూనికేషన్ కంపెనీలు ఒమన్లోని తమ ఉద్యోగుల ద్వారానే నేరుగా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిర్వహించాలని TRA వెల్లడించింది. కొన్ని కంపెనీలు తమ ప్లాట్ఫామ్లలో కంటెంట్ను షెడ్యూల్ చేయడానికి మరియు లింక్ చేయడానికి దేశం బయట నుంచి ప్రత్యేక డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నాయని, ఇకపై అన్ని కార్యకలాపాలు మరియు పర్యవేక్షణ పూర్తిగా ఒమన్ లోనే నిర్వహించాలని అథారిటీ స్పష్టం చేసింది.
TRA లైసెన్స్ పొందిన కంపెనీలు తమ ప్లాట్ఫామ్లు మరియు వ్యవస్థలను దేశంలోని ఆమోదించబడిన స్థానిక సంస్థల ద్వారా నిర్వహించాలని తెలిపింది. డిజిటల్ ప్లాట్ఫామ్లపై పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సిందేనని తన ఉత్తర్వుల్లో అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







