సెనగపిండిని తో జిడ్డుకారే సమస్య అదుపులోకి...
- July 25, 2016
కాలేజీలు, ఉద్యోగాలు అంటూ బయటతిరిగే అమ్మాయిలకు ప్రధాన సమస్య ముఖంపై టాన్ పేరుకోవడం. దీనికి ఖరీదైన ఉత్పత్తులు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే సెనగపిండితోనూ ప్రయత్నించి ఫలితం పొందవచ్చు. అది ఎలా అంటే! ము ఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే పాలల్లో కాస్త సెనగపిండి, చెంచా తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. కాసేపాగి పాలతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. నలుపూ తగ్గుతుంది.
*
కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటివారు సెనగపిండికి కాస్త గులాబీ నీరు, పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి పూతలా వేస్తే జిడ్డుకారే సమస్య అదుపులోకి వస్తుంది.
*
సెనగపిండిని పాలతో మెత్తని పేస్ట్లా చేసుకున్నాక దానికి అరకప్పు పంచదార చేర్చాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి దూరమవుతుంది. మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
*
కొందరికి మోచేతులు, మెడ దగ్గర నల్లగా తయారవుతుంది. ఇలాంటివారు సెనగపిండిలో తగినంత నిమ్మరసం, మూడు చెంచాల పంచదార కలిపి ఆ ప్రదేశాల్లో రాసుకుని రుద్దాలి. ఇలా కనీసం వారంలో రెండు సార్లు చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







