అమరవీరులకు మోదీ ఘన నివాళి

- July 26, 2016 , by Maagulf
అమరవీరులకు మోదీ ఘన నివాళి

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ వేదికగా వారి పరాక్రమాలను గుర్తుచేసుకున్నారు. దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. అలాంటి వీరుల త్యాగం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు.
భారత సైన్యం... పాక్‌ సేనలకు మరిచిపోలేని రీతిలో బుద్ధి చెప్పిందన్న మోదీ.. నాటి రాజకీయ నాయకత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్ని కొనియాడారు. భారత్‌లో పాక్‌ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో.. 1999 మే నెలలో ఇరు దేశాల మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది. జులై 26న ముగిసిన ఈ యుద్ధంలో పాక్‌పై భారత సైనికులు ఘన విజయం సాధించడంతో ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com