వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!

- December 04, 2025 , by Maagulf
వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!

మస్కట్: వాణిజ్య, పెట్టుబడుల విస్తరణపై ఒమన్, భారత్ చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ టెలిఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల విస్తరణతో సహా ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అదనపు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రత, సహకారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలపై మంత్రులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com