2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- December 04, 2025
రియాద్: 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్ అందుబాటులోకి రానుంది. దిరియా గేట్ను కిద్దియాతో అనుసంధానించే కొత్త మెట్రో ట్రాక్ ను ప్రారంభించనున్నారు. మెట్రో పొడిగింపు మరియు రియాద్ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేవి రియాద్ లో కొనసాగుతున్న అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రణాళికలో భాగంగా అందుబాటులోకి తేనున్నారు.
ఈ ప్రాజెక్ట్ రియాద్ రవాణా నెట్వర్క్ను బలోపేతం చేయనుందని అధికారులు వెల్లడించారు. అలాగే రియాద్ ఫుడ్ స్ట్రీట్, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రియాద్ ను పర్యాటక కేంద్రంగా గుర్తింపును బలోపేతం చేస్తుందని అన్నారు.
వీటితో పాటు మెయిన్ మరియు రింగ్ రోడ్స్ యాక్సెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నగర నెట్వర్క్లోని 500 కిలోమీటర్లకు పైగా ఉన్న కారిడార్లను మెరుగుపరిచి, ప్రధాన కొత్త మార్గాల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతుందని ప్రకటించారు. గ్రీన్ రియాద్ కార్యక్రమంలో భాగంగా పార్కులు, వీధులు, పబ్లిక్ ప్రదేశాలలో సుమారు 7.5 మిలియన్ల కొత్త చెట్లను నాటనున్నారు. ఈ ప్రాజెక్టు తలసరి గ్రీనరీని ప్రస్తుతం ఉన్న 1.7 చదరపు మీటర్ల నుండి 28 చదరపు మీటర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ







