ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- December 05, 2025
హైదరాబాద్: ఇండిగో సేవల్లో చోటుచేసుకున్న అంతరాయాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంస్థ మొత్తం 92 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించగా, వాటిలో 43 విమానాలు శంషాబాద్కు రావాల్సినవే కాగా, 49 విమానాలు అక్కడి నుండి బయలుదేరాల్సినవే. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు చెక్–ఇన్ పూర్తి చేసిన తర్వాతే రద్దు సమాచారం అందడంతో ఎయిర్పోర్ట్లో నిరసనలు వ్యక్తం చేశారు.
విశాఖపట్నం విమానాశ్రయం పరిస్థితి కూడా భిన్నంగా లేకుండా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలకు వెళ్లే 8 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. గత నాలుగు రోజులుగా ఇండిగో ఆపరేషన్లలో తీవ్ర అంతరాయం ఏర్పడి, దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవ్వడంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రత్యేకంగా ఢిల్లీలో పరిస్థితి మరింత దిగజారింది. టెర్మినల్లో వేలాది బాగేజీలు పేరుకుపోయాయి. కొంతమంది ప్రయాణికులు 12–14 గంటల పాటు తాగునీరు, భోజనం లేకుండా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ అవ్యవస్థకు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) కొత్త నియమావళి అమలు, క్రూ మేనేజ్మెంట్లో లోపాలు, శీతాకాలం కారణంగా ఉన్న ఆపరేషనల్ ఆంక్షలు మరియు సిబ్బంది కొరత వంటి అంశాలే ప్రధాన కారణాలని డీజీసీఏ సమీక్షలో తేలింది.
ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్బస్ A320 ఫ్లైట్లకు FDTL నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను అభ్యర్థించింది. అయితే దీనిపై డీజీసీఏ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









