అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- December 05, 2025
అమరావతి: అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. రెండో దశ ల్యాండ్ పూలింగ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడంతో భూ సమీకరణ ప్రక్రియ పునరుద్ధరించబడింది. ఇదే సందర్భంలో సీఆర్డీఏ కూడా పలు కీలక నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.రెండో విడతలో భూములు ఇస్తున్న రైతులకు ప్యాకేజీని ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, అమరావతి మౌలిక సదుపాయాల కోసం మరో భారీ రుణాన్ని తీసుకునేందుకు ఆమోదం లభించింది.
లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీకి గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
- లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి రూ.169 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయం.
- జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు రూ.163 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు.
- 2024–25 వార్షిక నివేదికలు సమర్పణకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
అమరావతికి భారీ రుణం–రోడ్ల అభివృద్ధికి నిధులు
అమరావతి నిర్మాణానికి నాబార్డ్(NABARD) ద్వారా రూ.7,380.70 కోట్ల రుణం తీసుకోవడం ప్రభుత్వం అంగీకరించింది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారితో అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మంత్రి నారాయణ ప్రకారం, జనవరి నాటికి సీడ్ యాక్సిస్ రహదారి మంగళగిరి రోడ్డుకు కలుస్తుంది. జాతీయ రహదారికి అనుసంధానం వేగంగా జరుగుతోందని తెలిపారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పలు మెగా ప్రాజెక్టులను ప్రకటించింది.
- స్మార్ట్ ఇండస్ట్రీల ఏర్పాటు
- అంతర్జాతీయ విమానాశ్రయం
- ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి
రెండో విడతలో రైతులు ఇవ్వనున్న 7,000 ఎకరాల్లో 2,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడత రైతులకు వర్తించిన ప్యాకేజీనే రెండో విడత రైతులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







