వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- December 07, 2025
ఖతార్లో దాదాపు రెండు దశాబ్దాలుగా నివసిస్తూ సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న విశాఖ వాసి, కమ్యూనిటీ నాయకుడు మరియు హ్యూమానిటేరియన్ వెంకప్ప భాగవతులకి గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) అత్యున్నత గౌరవంగా “ఉత్తమ సేవా పురస్కారం (Best Philanthropy Award)” ప్రకటించబడింది.
ఇటీవలి ఇండోర్, మధ్యప్రదేశ్లో జరిగిన GIO నాల్గవ అంతర్జాతీయ మహాసభలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేశారు. స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సామాజిక సేవా రంగంలో చూపుతున్న ఆయన అంకితభావం, మానవతా విలువలు మరియు ప్రభావవంతమైన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.
పురస్కారం స్వీకరించిన అనంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన వెంకప్ప భాగవతుల , “ఈ అవార్డు నా వ్యక్తిగత కృషికి మాత్రమే కాకుండా, ఈ ప్రయాణంలో నా వెంట నడిచిన సహచరులు, భాగస్వాములు, మార్గదర్శకులు, మిత్రులు మరియు సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి గుర్తింపు” అని పేర్కొన్నారు.
అలాగే, GIO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గౌరవం తనను మరింతగా నేర్చుకునేందుకు, ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరేపిస్తుందని తెలిపారు. “స్థానికంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయడంలో కొనసాగుతాను” అని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక సేవ పట్ల తన నిరంతర కృషితో ఇప్పటికే అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వెంకప్ప భాగవతుల తాజా సత్కారం, సమాజ సేవలో నూతన మైలురాయిగా నిలిచింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మా గల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







